నోట్ల కట్టలతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే కుట్రలను తెలంగాణ బిడ్డలు పటాపంచలు చేశారు. బీజేపీ పెద్దలు గద్దల్లా మారి టీఆర్ఎస్(బీఆర్ఎస్) ఎమ్మెల్యేల కొనుగోలుకు బరితెగించడంపై మండిపడుతున్నారు. టీఆర్ఎస్(బీఆర్ఎస్)ను నేరుగా ఎదుర్కొనే సత్తా లేక, దొడ్డిదారిన రాష్ట్రంలో బీజేపీ ప్రాబల్యాన్ని పెంచుకోవాలని చూడడం
సిగ్గుచేటు అని గళమెత్తారు. మహారాష్ట్రలోలాగా దిగుజారుడు రాజకీయాలు చేస్తే మౌనంగా ఉండమని, ఇది వీర తెలంగాణ అని గర్జించారు. తెలంగాణ నాట్ ఫర్ సేల్ అంటూ ప్లకార్డులతో గురువారం టీఆర్ఎస్ శ్రేణులు రోడ్డెక్కాయి.
ప్రలోభాలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకునే బీజేపీకి ప్రజలు బుద్ధి చెప్పాలంటూ ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. బీజేపీ దుర్మార్గాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తెలంగాణలో మోదీ, అమిత్షా ఆటలు సాగవని హెచ్చరించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బాధ్యత గల పౌరులుగా వ్యవహరించారని కొనియాడారు.
– నమస్తే తెలంగాణ, న్యూస్నెట్వర్క్