ఆర్కేపురం, ఏప్రిల్ 4 : పెరిగిన స్టీల్, సిమెంట్ ధరలను, జీఎస్టీని వెంటనే తగ్గించాలని గ్రేటర్ ఈస్ట్ జోన్ బిల్డర్స్ అసోసియేషన్ చైర్మన్ నర్సింగ్రావు (టీఎన్ఆర్), అధ్యక్షుడు సతీశ్కుమార్ కోరారు. సోమవారం కొత్తపేటలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. ధరలు పెరుగుతుండటంతో నిర్మాణ రంగం మూతపడే ప్రమాదం ఏర్పడిందని తెలిపారు. దీంతో, లక్షలాది కార్మికుల కుటుంబాలు రోడ్డున పడే ప్రమాదం ఉన్నదని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ధరలు తగ్గించే విధంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఫిబ్రవరి నెలలో స్టీల్ ధర టన్నుకు రూ.55 వేలు ఉండగా, ప్రస్తుతం రూ.90 వేలకు పెరిగిందని తెలిపారు.
సిమెంట్ రూ.250 ఉంటే, ప్రస్తుతం రూ.400 లకు పెరిగిందని పేర్కొన్నారు. సిమెంట్పై 28శాతం, స్టీల్పై 18 శాతం జీఎస్టీని తగ్గించాలని వారు డిమాండ్ చేశారు. కొనుగోలు దారుడిపై పడుతున్న 5 శాతం జీఎస్టీని కేంద్ర ప్రభుత్వం ఎత్తివేయాలని కోరారు. పెరిగిన స్టీల్, సిమెంట్ ధరలను తగ్గించాలని డిమాండ్తో ఒకరోజు నిర్మాణ పనులను ఆపి వేసినట్లు తెలిపారు. అనంతరం నిర్మాణంలో ఉన్న భవనం వద్దకు వెళ్లి నిరసన తెలిపారు. ఈ సమావేశంలో ఉపాధ్యక్షుడు ఎ.శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శి రవీంద్రబాబు, ఆర్గనైజింగ్ సెక్రటరీ మోర్రిశెట్టి శ్రీనివాస్, మెంబర్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.