హైదరాబాద్ : దుండిగల్లో(Dundigal) దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళను(Woman) గుర్తు తెలియని దుండగులు రాళ్లతో కొట్టి(Brutal murder) చంపారు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. సక్కుబాయి అనే మహిళ కుటుంబ కలహాలతో రెండు రోజుల క్రితం ఇంట్లో నుంచి ఎవరికి చెప్పకుండా వెళ్లిపోయింది. ఆమె కుమారుడు శేఖర్ తన తల్లి అదృశ్యమైందని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.
కాగా, సక్కుబాయిని రెండు రోజుల క్రితం గుర్తు తెలియని దుండగులు బండరాయితో కొట్టి చంపారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.