మారేడ్పల్లి, జూన్ 2: బాబాయి కుమార్తె (చెల్లెలి)తో అసభ్యంగా ప్రవర్తించడాన్ని, తన తండ్రితో గొడవకు దిగడాన్ని ప్రశ్నించిన ఓ యువకుడిపై కక్ష పెంచుకున్న నలుగురు వ్యక్తులు అతన్ని అడ్డగించి కత్తితో విచక్షణారహితంగా పొడి చి హత్య చేసిన ఘటన మారేడ్పల్లిలో జరిగింది. నిందితుల వద్ద నుంచి కత్తి, సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం కేసుకు సంబంధించిన వివరాలను బేగంపేట ఏసీపీ గోపాల కృష్ణమూర్తి ఇన్స్పెక్టర్ నోముల వెంకటేష్లు వెల్లడించారు.
ఈస్ట్ మారేడ్పలిక్లి చెందిన పరుశురాం ప్లవర్ డెకరేషన్ వ్యాపారి. అతని కుమారుడు శ్రావన్ తండ్రికి వ్యాపారంలో తోడుగా ఉంటున్నాడు. అదే ప్రాంతానికి చెందిన రామ్దాస్ కుమారుడు పంగ సాయి నిఖిల్ (22) గంజాయికి అలవాటు పడి జులాయిగా తిరుగుతున్నాడు. గత నెల 31న శ్రవన్ కుటుంబ సభ్యులందరూ భువనగిరిలోని ఓ దేవాలయంకు వెళ్లి తిరిగి ఇంటికి చేరుకున్నారు. అదే రోజు రాత్రి మృతుడి చెల్లెలిని నిందితుడు సాయి నిఖిల్ వేధింపులకు గురి చేయడంతో పాటు అసభ్యకరమైన పదజాలంతో దూషించాడు.
ఈ క్రమంలో మృతుడి తండ్రి పరుశురాం అక్కడికి చేరుకొని వారిని మందలించి వెళ్లగొట్టారు. జరిగిన విషయాన్ని శ్రవన్కు కుటుంబ సభ్యులు చెప్పగా.. తన చెల్లెలు, మా నాన్నతో ఎందుకు గొడవ పడ్డావ్ అని సాయి నిఖిల్ను ప్రశ్నించగా.. ఇరువురి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. అప్పటికే మద్యం, గంజాయి మత్తులో ఉన్న అదే ప్రాంతానికి చెందిన బండి ఆనంద్ అలియాస్ (19), చింతకాయల సాయినాథ్ (26), రాసేపల్లి రమేష్ (20) సహకారంతో సాయి నిఖిల్ కత్తితో శ్రవణ్పై 8 చోట్ల దాడి చేశాడు. శ్రవణ్ను గాంధీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ 1న మృతి చెందాడు. తండ్రి ఫిర్యాదు మేరకు మంగళవారం నిందితులు అరెస్ట్ చేశారు.