KTR | సిటీబ్యూరో, మార్చి 31 (నమస్తే తెలంగాణ) :సికింద్రాబాద్ ఎంపీ, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఐదేండ్లలో చేసిందేమీ లేదని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. కిషన్ రెడ్డి హైదరాబాద్ నగరానికిగానీ తెలంగాణకుగానీ ప్రత్యేకంగా తీసుకువచ్చిన అదనపు ప్రాజెక్టుగానీ, ఒక రూపాయి అదనపు నిధులు కానీ ఏం లేవని కేటీఆర్ మండిపడ్డారు. అంబర్పేట నియోజకవర్గంలో ప్రజల చేతిలో తిరసారానికి గురైన తర్వాత, అదృష్టవశాత్తు గత ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి ఎంపీగా గెలిచారని కేటీఆర్ అన్నారు. గెలిచిన తర్వాత పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో చేసిన అభివృద్ధి శూన్యమన్నారు.
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పద్మారావు గౌడ్కు మద్దతుగా అంబర్పేట నియోజకవర్గంలో ఆదివారం కేటీఆర్ పాదయాత్ర నిర్వహించారు. కిషన్ రెడ్డికి దమ్ముంటే ఐదేండ్లలో తీసుకువచ్చిన నిధులు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల ముందు ఉంచి ఈ ఎన్నికల్లో ఓట్లు అడగాలని కేటీఆర్ సవాల్ విసిరారు. గత ఎన్నికల్లో అనుకోకుండా గెలిచిన కిషన్ రెడ్డి, ఈసారి మాత్రం కచ్చితంగా ప్రజల చేతిలో తిరసారానికి గురవుతారని, సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానంలో ఆయన ఓటమి ఖాయమని కేటీఆర్ జోస్యం చెప్పారు.
పదేండ్లలో హైదరాబాద్ నగరానికి బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని గుర్తుంచుకొని, తమ పార్టీ ఎంపీ అభ్యర్థి పద్మారావు గౌడ్కి మద్దతు ఇవ్వాలని కేటీఆర్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. గెలిచిన తర్వాత అధికారం కోసం ఢిల్లీకి పర్యటనలు చేసే నాయకులను కాకుండా, నిత్యం 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండే పద్మారావు గౌడ్ వంటి ప్రజా నాయకులు అవసరమని కేటీఆర్ అన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి గులాబీ పార్టీకి మద్దతు ఇవ్వాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. భారత రాష్ట్ర సమితికి కంచుకోటగా మారిన రాజధానిలో ఈసారి కూడా గులాబీ జెండా ఎగురుతుందని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.
అంబర్పేటలోని ప్రేమ్ నగర్ నుంచి ఆజాద్ నగర్ , పటేల్నగర్లలో ఇంటింటికీ తిరిగిన కేటీఆర్కు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. సెల్ఫీలు తీసుకునేందుకు పోటీ పడ్డారు. జై తెలంగాణ నినాదాలతో హోరెత్తించారు. ప్రజలతో మమేకమైన కేటీఆర్..వారిని ఆప్యాయంగా పలకరించారు. యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్ సారు డబుల్ బెడ్రూం ఇండు ్ల ఇచ్చారని కొందరు… దళిత బందు పథకంతో దర్జాగా బతుకుతున్నామని ఇంకొందరు.
బీసీ బంధుతో ఉపాధి పొందుతున్నామని మరి కొందరు తెలుపగా.. కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరిస్తూ ప్రచారం నిర్వహించారు. చిరువ్యాపారులతో ముచ్చటించారు. పద్మారావు గౌడ్ను ఎంపీగా గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేశ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, ముఠా గోపాల్ , స్థానిక కార్పొరేటర్లు, ముఠా జై సింహ తదితరులు పాల్గొన్నారు.