KTR | మేడ్చల్, ఫిబ్రవరి 2(నమస్తే తెలంగాణ): ఆరు గ్యారంటీల అమలుపై సీఎం రేవంత్రెడ్డి చేతులెత్తాశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కేంద్రంలో తాము అధికారంలోకి వస్తేనే గ్యారంటీలను అమలు చేస్తామంటున్నారని విమర్శించారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ మండలం చౌదరిగూడలో శుక్రవారం జరిగిన మేడ్చల్ నియోజకవర్గ విజయోత్సవ సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ప్రజలకు 420 హామీలిచ్చి.. గద్దె నెక్కిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రజలకు పనికి వచ్చే పనులు చేయకపోగా పనికి మాలిన మాటలు మాట్లాడుతున్నారన్నారు. దొంగ హామీలు ఇచ్చి గద్దెనెక్కిన రేవంత్రెడ్డి ప్రభుత్వం 50 నుంచి 60 రోజుల్లోనే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేత మూటగట్టుకుందన్నారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పే సమయం తొందరగా వచ్చిందన్నారు. డిసెంబర్ 9న రైతు రుణ మాఫీ చేస్తానన్న ముఖ్యమంత్రి రేవంత్ ఆ హామీ ఏమైందని కేటీఆర్ ప్రశ్నించారు. వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామన్నారని, వందరోజుల్లో అమలు చేయకపోతే ప్రజల తరపున పోరాడుతామన్నారు.
కేంద్రంలో బీజేపీ ఆపే సత్తా కాంగ్రెస్కు లేదని, బలమైన ప్రాంతీయ పార్టీల నాయకులు కేసీఆర్, మమతా బెనర్జీ, కేజ్రీవాల్లకు ఉన్నదని కేటీఆర్ అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి చెక్ పెట్టాలంటే బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన అవసరమున్నదన్నారు.
కేపీహెచ్బీ కాలనీ: కూకట్పల్లి నియోజకవర్గం బీఆర్ఎస్ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశాన్ని శనివారం ఎన్కేఎన్ఆర్ గార్డెన్లో నిర్వహిస్తున్నట్లు సతీశ్ అరోరా తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు హాజరుకానున్నట్లు వెల్లడించారు.
కేంద్రం నుంచి రాష్ట్ర హక్కులను సాధించాలన్నా.. రెండు జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలను నిలదీయాలన్నా.. తెలంగాణ రాష్ట్రంలో గులాబీ జెండా ఎగరాల్సిందేనన్నారు. మన హక్కులు, కృష్ణా జలాల కోసం కొట్లాడుతున్నది బీఆర్ఎస్ ఎంపీలేనని కేటీఆర్ గుర్తు చేశారు. రాహుల్ గాంధీ చేపట్టిన జోడో యాత్ర చోడో యాత్రగా మారిందని ఎమ్మెల్యే మల్లారెడ్డి ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు ఆరు గ్యారంటీలను అమలు చేయలేదని పరిస్థితిలో ఉందన్నారు. 50 రోజుల్లోనే ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వంపై విసుగు వచ్చిందన్నారు. ఈ విజయోత్సవ సభలో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్రాజు, మేయర్ జక్క వెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కుత్బుల్లాపూర్: పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మల్కాజిగిరి పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తే అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామంటూ.. కుత్బుల్లాపూర్ 131 డివిజన్ పార్టీ శ్రేణులు శుక్రవారం ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఎంపీగా కేటీఆర్ పోటీ చేస్తే భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని మాజీ కార్పొరేటర్ కేఎం గౌరీశ్ స్పష్టం చేశారు.
అనారోగ్యంతో బాధపడుతున్న తెలంగాణ ఉద్యమకారుడు శేషు కుమారుడు ప్రదీప్ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుక్రవారం పరామర్శించారు. చౌదరిగూడలో జరిగిన విజయోత్సవ సభలో పాల్గొన్న ఆయన..అనంతరం మైసమ్మగుట్టలో ప్రదీప్ నివాసానికి వెళ్లి పలకరించారు. వైద్యం కోసం లక్ష రూపాయల చెక్కును అందజేశారు.