Niveditha Sayanna | కంటోన్మెంట్లో బీఆర్ఎస్ బలంగా ఉందని దివంగత ఎమ్మెల్యే సాయన్న కుమార్తె, బీఆర్ఎస్ నాయకురాలు నివేదిత సాయన్న తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో కంటోన్మెంట్లో ఎంతో అభివృద్ధి జరిగిందని పేర్కొన్నారు. పేదల కోసం కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారని చెప్పారు.
సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఆదివారం బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నివేదిత మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలనలో కంటోన్మెంట్ అభివృద్ధి కుంటుపడిందని అన్నారు. కంటోన్మెంట్లో మళ్లీ బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.