మేడ్చల్, సెప్టెంబర్ 8 : వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్దే విజయమని, హ్యాట్రిక్ సీఎం కేసీఆర్ అని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ మండలం గౌడవెల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు బోయినిపల్లి క్యాంపు కార్యాలయంలో మంత్రి మల్లాడ్డి సమక్షంలో శుక్రవారం బీఆర్ఎస్ చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వేరే పార్టీలకు చోటు లేదన్నారు. తొమ్మిదేండ్ల పాలనలో సీఎం కేసీఆర్ ఎంతో ప్రగతి సాధించారన్నారు. అభివృద్ధి, సంక్షేమంతో రాష్ర్టాన్ని దేశంలోనే నంబర్ వన్ స్థానంలో ఉంచారన్నారు.
సీఎం కేసీఆర్ పాలన తీరు ఆకర్షితులై పలు పార్టీలకు చెందిన నాయకులు, వివిధ వర్గాల ప్రజలు బీఆర్ఎస్లో స్వచ్ఛందంగా చేరుతున్నారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయాన్ని సాధించి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీలకు కాలం చెల్లిందన్నారు. బంగారు తెలంగాణకు ప్రజలంతా ఏకమై సీఎం కేసీఆర్కు మద్దతు పలకాల్సిన అవసరం ఉందన్నారు. గౌడవెల్లి గ్రామానికి చెందిన చందన, సుకన్య, అనిల్, వెంకటేశ్, హరికృష్ణ, నరేశ్, ప్రవీణ్, మహేశ్, అఖిల్తో పాటు 30 మంది బీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో ఎంపీపీ రజిత రాజమల్లారెడ్డి, జడ్పీటీసీ శైలజావిజయానందారెడ్డి, సర్పంచ్ల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు విజయానందారెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ భాస్కర్ యాదవ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దయానంద్ యాదవ్, మాజీ అధ్యక్షుడు శ్రీనివాస్ రాజు, డబిల్పూర్ పీఏసీఎస్ చైర్మన్ సురేశ్ రెడ్డి, సర్పంచ్లు, కో ఆప్షన్ సభ్యులు, కౌన్సిలర్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.