మంగళవారం తెల్లవారు జామున భారీ వర్షానికి కంటోన్మెంట్లోని లోతట్టు ప్రాంతాలు, ఓపెన్నాలా పరిసరాలు నీట మునిగాయి. రెండోవార్డులోని రసూల్పురా ఇందిరమ్మనగర్, 105 గల్లీ, మూడో వార్డులోని విమాన్ నగర్ కాలనీ, పైగా కాలనీ, బాలంరాయి, మార్గదర్శి కాలనీ, సిఖ్ విలేజ్తో పాటు ఆరో వార్డులోని సీతారాంపురం, ప్రోగ్రెసీవ్ కాలనీ, మర్రి రాఘవయ్య కాలనీతో పాటు పలు ప్రధాన మార్గాల్లో వరదనీరు నిలిచిపోవడంతో స్థానికులు ఇబ్బందులకు గురయ్యారు. ఇందిరమ్మనగర్, 105 గల్లీ, పైగా కాలనీల్లో ఇళ్లలోకి వరద నీరు చేరింది.
ఉప్పరిబస్తీలో కూలిన చెట్టు
సీతాఫల్మండి డివిజన్ పరిధిలోని ఉప్పరి బస్తీలో పురాతన చెట్టు కూలింది.ఆసమయంలో అక్కడ ఎవరూ లేక పోవడంతో ప్రమాదం తప్పింది.విషయం తెలుసుకున్న డివిజన్ కార్పొరేటర్ హేమ జీహెజ్ఎంసీ అధికారులకు సమాచారం అందించారు.డీఈఈ సువర్ణ,ఏఈ కౌషిక్ డీఆర్ఎఫ్ బృందాలను పంపారు.సిబ్బంది వచ్చి చెట్టు కొమ్మలను తొలగించి రోడ్డును క్లియర్ చేశారు.
చిలకలగూడలో కూలిన పురాతన ముస్లిం గ్రేవ్ యార్డు గోడ
చిలకలగూడ ముస్లిం సోదరుల గ్రేవ్ యార్డు గోడ వర్షానికి నాని కూలింది.అలాగే అక్కడ ఉన్న విద్యుత్ స్తంభం కూలింది.డివిజన్ కార్పొరేటర్ హేమ,జీహెచ్ఎంసీ అధికారి ఏఈ కౌషిక్తో కలిసి ఆప్రాంతాన్ని సందర్శించారు.
లోతట్టు ప్రాంతాల్లో కార్పొరేటర్ పర్యటన
గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీతాఫల్మండి డివిజన్ కార్పొరేటర్ హేమ అన్నారు.పురాతన ఇళ్లలో నివసించే వారికి ఇబ్బందులు కలిగితే తన దృష్టికి తీసుకురావాలన్నారు.ప్రజలు తాత్కాలికంగా ఉండటానికి జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశామని చెప్పారు.
కొనసాగుతున్న సహాయక చర్యలు
త కొన్నిరోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జనజీవనం అస్తవ్యస్థమవుతుంది. మెట్టుగూడ, అడ్డగుట్ట ప్రాంతాల్లో ప్రజలకు, వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జీహెచ్ఎమ్సీ అధికారులు, సిబ్బంది, మాన్సూన్ అత్యవసర బృందాలు అనునిత్యం అందుబాటులో ఉంటూ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నారు. మెట్టుగూడ డివిజన్లో జీహెచ్ఎమ్సీ డీఈ ప్రశాంతి, ఏఈ శశిధర్ రెడ్డిలు ముందస్తు చర్యలను చేపట్టి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.
సహాయక చర్యలు చేపట్టిన జీహెచ్ఎంసీ
మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు సికింద్రాబాద్ లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.దీంతో ప్రజలు అనేక ఇబ్బందుకు పడ్డారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలో లోతట్టు ప్రాంతాలు,నాలా పరీవాహక ప్రాంతాల ప్రజలను ,అధికారులను,కార్పొరేటర్లను డిప్యూటీ స్పీకర్ తిగుల్ల పద్మారావుగౌడ్ అప్రమత్తం చేశారు.అప్రమత్తమైన జీహెచ్ఎంసీ అధికారులు ,డివిజన్ల కార్పొరేటర్లు ఉదయం నుండే డివిజన్ల పరిధిలో పర్యటించారు.