ఆర్కేపురం, ఫిబ్రవరి 28 : ఆర్కేపురం డివిజన్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఉద్యమకారులు, కలిసికట్టుగా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం జిల్లెలగూడ ఎస్వైఆర్ గార్డెన్లో ఆర్కేపురం డివిజన్ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి మాట్లాడుతూ.. ఆర్కేపురం డివిజన్లో ప్రతి కార్యకర్తలు రాబోయే రోజుల్లో సీఎం కేసీఆర్ నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి ఇంటికి చేరే విధంగా ప్రచారం నిర్వహించాలని సూచించారు. కార్యకర్తలకు ఏ ఆపద వచ్చినా ముందుండి ఆదుకుంటానని, మతతత్వ పార్టీలు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పి కొట్టాలని తెలిపారు. మహేశ్వరం నియోజకవర్గంలోని ప్రతి మండలంలో, ప్రతి డివిజన్లో కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. నియోజకవర్గం స్థాయి నాయకులు, స్థానిక నాయకులు, కార్యకర్తలతో సంబంధాలు ఏర్పర్చుకొని తమ దృష్టికి తీసుకురావాలని, తద్వారా నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీని తిరుగులేని శక్తిగా తయారు చేయడానికి సహకరించాలని కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శులు మురుకుంట్ల అరవింద్శర్మ, బేర బాలకిషన్, ఉపాధ్యక్షులు గంగాపురం లక్ష్మీనరసింహారెడ్డి, ఆర్కేపురం డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షులు పెండ్యాల నగేశ్, కార్యదర్శి వెంకటేశ్గౌడ్, ఖిల్లా మైసమ్మ ఆలయ చైర్మన్ గొడుగు శ్రీనివాస్, ఆర్కేపురం డివిజన్ మహిళా అధ్యక్షురాలు లిక్కి ఊర్మిలారెడ్డి, నియోజకవర్గ వర్కింగ్ అధ్యక్షురాలు పటేల్ సునీతారెడ్డి, ఆర్కేపురం మాజీ అధ్యక్షురాలు చామల శైలజారెడ్డి, సీనియర్ నాయకులు మారోజు రామాచారి, న్యాలకొండ శ్రీనివాస్రెడ్డి, కంచర్ల శేఖర్, పెంబర్తి శ్రీనివాస్, జగన్మోహన్రెడ్డి, దుబ్బాక శేఖర్, అల్లావుద్దిన్ పటేల్, పరీద్ పాషా, చోటు, పుష్షలతారెడ్డి, మారం సుజాతారెడ్డి తదితరులు పాల్గొన్నారు.