Telangana Assembly Elections | మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో బీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతోంది. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ వెనుకంజలో ఉంది. ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ కారు జోరు కొనసాగుతోంది. మల్కాజ్గిరి, ఉప్పల్, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, ఎల్బీనగర్, మేడ్చల్ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు లీడ్లో ఉన్నారు. మల్కాజ్గిరిలో మర్రి రాజశేఖర్ రెడ్డి, ఉప్పల్లో బండారి లక్ష్మారెడ్డి, కుత్బుల్లాపూర్లో కేపీ వివేకానంద, కూకట్పల్లిలో మాధవరం కృష్ణారావు, ఎల్బీనగర్లో సుధీర్ రెడ్డి, మేడ్చల్లో మల్లారెడ్డి గెలుపు దిశగా దూసుకుపోతున్నారు.