మల్కాజిగిరి, డిసెంబర్ 1: మల్కాజిగిరి నియోజక వర్గంలో కారు జోరు.. తగ్గెదే లేదంటున్నారు ఓటర్లు.. ఎగ్జిట్ పోల్స్ ఫాల్స్ అంటూ మరికొందరు మండిపడుతు న్నారు. గురువారం సాయంత్రం 5గంటల తర్వాత కొందరు ఓటర్లు ఓటు వేస్తుండగానే కొన్ని మీడియా సంస్థలు ఎగ్జిట్ పోల్స్ అంటు హడావుడి చేయడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే మల్కాజిగిరి నియోజకవర్గంలో మొత్తం 4,89,043 ఓటర్లు ఉండగా పురుషులు 2,46,754, మహిళలు 2,42,278, ఇతరులు 11మంది ఉన్నారు. 429 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయగా ఎన్నికల్లో 53.99 శాతంగా పోలింగ్ నమోదైంది.
మల్కాజిగిరి నియోజకవర్గంలో 2018 ఎన్నికల్లో మొత్తం ఓటర్లు.. 3,93,679 ఉండగా, 2,09,499 ఓట్లు పోలయ్యాయి. పోస్టల్ బ్యాలెట్ ద్వారా 528, నోటాకు 3,391 ఓట్లు పడ్డాయి. కాగా ఎన్నికల్లో మైనంపల్లి హన్మంతరావు(టీఆర్ఎస్) 1,14,149 ఓట్లతో గెలుపొందారు. రామచందర్రావు(బీజేపీ)కు 40,451, కే దిలీప్కుమార్ (టీజేఎస్)కు 34,219కు ఓట్లు వచ్చాయి.
ఇదిలా ఉంటే ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మర్రి రాజశేఖర్రెడ్డి గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి. 2018 లో జరిగిన ఎన్నికల్లో ఓటర్లు సీఎం కేసీఆర్ను చూసి టీఆర్ఎస్ పార్టీకి 73,698 ఓట్ల మెజారిటీ అందిం చారు. ప్రస్తుత ఎన్నికల్లో మల్కాజిగిరిలో కాంగ్రెస్ ప్రభావం 35వేల ఓట్లకు మించవని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గత ఎన్నికలతో పోల్చీతే బీజేపీ గ్రాఫ్ పడిపోయింది. గురువారం జరిగిన ఎన్నికలో కాంగ్రెస్, బీజేపీలు బీఆర్ఎప్ పార్టీతో పోటీ పడలేక పోయాయని వారు అంచనా వేస్తున్నారు. మల్కాజిగిరి నియోజకవర్గంలో బీఆర్ఎస్ గెలుస్తుందని సర్వేలు చెబుతున్నాయి. ప్రతి పక్షాల అంచనాకు మించి బీఆర్ఎస్ పార్టీకి మెజారిటీ వస్తుందని ఓటర్లు అసక్తితో ఎదురు చూస్తున్నారు.