అడ్డగుట్ట, ఏప్రిల్ 24 : సికింద్రాబాద్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపు దాదాపుగా ఖరారైందని సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి పద్మారావు గౌడ్ అన్నారు. బుధవారం అడ్డగుట్ట డివిజన్లో స్థానిక కార్పొరేటర్ లింగాని ప్రసన్నలక్ష్మీ శ్రీనివాస్, మెట్టుగూడ కార్పొరేటర్ రాసూరి సునీత, పార్టీశ్రేణులతో కలిసి గడపగడపకు తిరుగుతూ ప్రజలను ఓట్లు అభ్యర్థించారు.
ఏ ప్రాంతానికి వెళ్లినా.. ప్రజలు అక్కున చేర్చుకుంటున్నారని, కారు గుర్తుకే ఓటు వేస్తామని ముక్తకంఠంతో చెబుతున్నారని పద్మారావుగౌడ్ తెలిపారు. కేంద్రంలో పదేండ్లు అధికారంలో ఉండి బీజేపీ తెలంగాణకు చేసిందేమీ లేదని, కాంగ్రెస్ పార్టీ అబద్ధపు హామీలను ప్రజలు నమ్మేస్థితిలో లేరని ఆయన స్పష్టం చేశారు.