కవాడిగూడ, మార్చి 28: ముస్లింల పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని గురువారం రాత్రి భోలక్పూర్లోని ఆషీర్ఖానలో మహ్మద్ జాఫర్ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పద్మారావుగౌడ్, ఎమ్మెల్యే ముఠా గోపాల్, బీఆర్ఎస్ గ్రేటర్ సీనియర్ నాయకుడు శ్రీనివాస్ రావు, ఎడ్ల హరిబాబు హాజరయ్యారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పద్మారావు మాట్లాడుతూ ఇఫ్తార్ విందు మత సామరస్యానికి ప్రతీక అని, ఐక్యతను పెంపొందిస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకుడు వై. శ్రీనివాస్ రావు, అజయ్ తదితరులు పాల్గొన్నారు.