KP Vivekanand | కుత్బుల్లాపూర్, ఫిబ్రవరి20 : ఆపదలో ఉండి ఆర్థిక సహాయం కోసం ఎదురుచూసే వారికి సీఎం సహాయనిధి ఎంతో భరోసానిస్తుందని బీఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. గురువారం కుత్బుల్లాపూర్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద కుత్బుల్లాపూర్ ప్రాంతానికి చెందిన జి. రామారావు, చింతల్ ప్రాంతానికి చెందిన బి.శ్రీనాథ్లకు ఆరోగ్య పరిస్థితి బాగాలేదని స్థానిక నాయకుల ద్వారా ఎమ్మెల్యే సమాచారం అందుకున్నారు. దీంతో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి జి. రామారావుకు రూ.2,00,000, బి.శ్రీనాథ్కు రూ.2,00,000 ఎల్ఓసీ మంజూరు చేయించి లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.