KP Vivekanand | కుత్బుల్లాపూర్, మార్చి16 : ముఖ్యమంత్రి సహాయ నిధి పేదల ఆరోగ్య భవిష్యత్తుకు పెన్నిదిగా ఉంటుందని బీఆర్ఎస్ పార్టీ విప్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. ఆదివారం చింతల్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సుభాష్ నగర్ ప్రాంతానికి చెందిన మైలరాం భార్గవి(30), గాజుల రామారం ప్రాంతానికి చెందిన షాజత్ బేగం (88) లు తమ ఆరోగ్య పరిస్థితిపై ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఎల్ఓసీ మంజూరుకై కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యేను ఆశ్రయించారు. దీంతో వారి ఆర్థిక పరిస్థితి, ఆరోగ్య పరిస్థితిపై చలించిన బిఆర్ఎస్ పార్టీ విప్ వివేకానంద్ ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మైలరాం భార్గవి తన భర్త మైలారం రమేష్కు రూ.1,25,000, షాజత్ బేగంకు రూ.2,00,000 లకు ఎల్ఓసీ మంజూరు చేయించి లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు.
ఈ సంధర్బంగా ఎమ్మెల్యే వివేకానంద్ మాట్లాడుతూ.. ఆపదలో ఉన్న నిరుపేదలకు ఆర్థిక భద్రతనిచ్చేది, ఆరోగ్య భరోసానిచ్చేది సీఎం సహాయనిధి అని అన్నారు. ఈ కార్యక్రమంలో సుభాష్ నగర్ డివిజన్ అధ్యక్షులు పోలే శ్రీకాంత్, సీనియర్ నాయకులు గుబ్బల లక్ష్మీ నారాయణ, దుర్గా రావు తదితరులు పాల్గొన్నారు.