కాచిగూడ, అక్టోబర్ 30: ప్రజలకు కావాల్సింది అభివృద్ధితో పాటు భరోసా అని, అది కేవలం ఒక్క బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కాలేరు వెంకటేశ్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ 100కు పైగా సీట్లు గెలుచుకోవడం, అదే విధంగా అంబర్పేటలో గులాబీ జెండా ఎగరవేయడం ఖాయమని పేర్కొన్నారు. సోమవారం కాచిగూడలోని మోతీలాల్నెహ్రూనగర్, రహమత్బాగ్, చెప్పల్బజార్ తదితర ప్రాంతాల్లో మందలాది మందితో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. రాజకీయాలకు అతీతంగా స్థానిక ప్రజలు ఏకగ్రీవ తీర్మాణాలతో ప్రచారంలో పాల్గొనడం విశేషం. బీఆర్ఎస్ అభ్యర్థి కాలేరు వెంకటేశ్కు ఏ బస్తీ, కాలనీకి వెళ్లిన మహిళలు, స్థానికులు మంగళహరతులతో బ్రహ్మరథం పడుతూ ఆదరిస్తున్నారు.
సీఎం కేసీఆర్ పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి, వారి జీవితాల్లో వెలుగులు నింపడంతో అంబర్పేట అభ్యర్థి గెలుపు సులువుగా మారిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు నేరుగా ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు. కాచిగూడలో పలు పార్టీల కార్యకర్తలందరూ రాజకీయాలకు ఆతీతంగా బీఆర్ఎస్ ప్రచారంలో పాల్గొనడం పార్టీకి కొండంతా బలం చేకూరింది. ఈ కార్యక్రమంలో పూలిజాల గెల్వయ్య, బండ సూరి, డివిజన్ అధ్యక్షుడు ఎర్రభీష్మాదేవ్, సునీల్బిడ్లాన్, రవీందర్యాదవ్, డాక్టర్ శిరీషాయాదవ్, శాంతి, ప్రతిభ, ఓం ప్రకాశ్యాదవ్, కె.సదానంద్, ధాత్రిక్ నాగేందర్బాబ్జి, బి.కృష్ణాగౌడ్, ఎల్.రమేశ్, మహేశ్కుమార్, పట్లూరి సతీశ్, పాండురంగ, క్రాంతి, మున్నాసింగ్, శ్రీశైలం, శేషు, బబ్లూ, అశోక్, అంటోని, నర్సింగ్బాబు, శ్రీనివాస్రెడ్డి, రెడపాక రాము, కిశోర్, బబ్బితో పాటు స్థానికులు పాల్గొన్నారు.