MLA Bandari Laxma Reddy | చర్లపల్లి, ఫిబ్రవరి 21 : నియోజకవర్గ పరిధిలోని కాలనీల సమగ్రాభివృద్ధికి నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తున్నామని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. చర్లపల్లి డివిజన్కు చెందిన సోనియా గాంధీ నగర్ ఫేజ్3 సంక్షేమ సంఘం నూతన కమిటి సభ్యులు ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డిని కలిసి కాలనీలోని సమస్యలను వివరించిన అనంతరం ఆయనను సన్మానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గ పరిధిలో నెలకొన్న సమస్యలను దశలవారిగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామన్నారు. కాలనీలో నెలకొన్న సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే దశలవారిగా పరిష్కరించేందుకు నిధులు కేటాయించనున్నట్లు ఆయన తెలిపారు. కాలనీలలో సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సినీయర్ నాయకుడు నేమూరి మహేశ్గౌడ్, కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు నల్లోల కనకయ్య, మాదాసు చంద్రం, కోశాధికారి చరక వెంకటేశ్, ఉపాధ్యాక్షులు ఆకుల సంతోష్, సంయుక్త కార్యదర్శి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.