కందుకూరు, డిసెంబర్ 13 : దేశ వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ బలోపేతం అవుతుందని రాష్ట్ర మాజీ కార్యదర్శి కప్పాటి పాండురంగారెడ్డి, కొత్త మనోహర్రెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత రాష్ట్ర సమితిగా ఆమోదం లభించిన అనంతరం ఈనెల 14న ఢిల్లీలో జాతీయ పార్టీ కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించి, యాగం నిర్వహించనున్నారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఢిల్లీకి వెళ్తూ మాట్లాడారు. తెలంగాణను సీఎం కేసీఆర్ అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారని.. దేశాన్ని కూడా ఇదే విధంగా అభివృద్ధి చేస్తారని తెలిపారు. ప్రజలందరూ బీఆర్ఎస్ పార్టీని ఆదరించాలని కోరారు.