కాచిగూడ, అక్టోబర్ 3 : దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు కావడంతో ప్రజలు బీఆర్ఎస్ పార్టీని ఎంతగానో విశ్వసిస్తున్నారని అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. సీఎం కేసీఆర్ తెలంగాణ వ్యాప్తంగా అమలుచేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కాచిగూడ డివిజన్ బీజేపీ మహిళామోర్చా అధ్యక్షురాలు మడిశెట్టి ప్రతిభతో పాటు మరో 70 మంది బీజేపీ నాయకులు మంగళవారం ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలేరు మాట్లాడుతూ పేద, మధ్య తరగతి ప్రజల కోసం తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పరిపాలన కొనసాగుతున్నదని, అందుకే ప్రజలు బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతూ, సీఎం కేసీఆర్ పరిపాలనకు జేజేలు పలుకుతున్నారని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం చేపడుతున్న అనేక సంక్షేమ పథకాలను గడప గడపకు తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాచిగూడ డివిజన్ బీజేపీ సీనియర్ నాయకుడు మడిశెట్టి ఆనంద్, ఎం.రాధిక, కె.శైలజ, విమల, ఎస్.సంగీత, శీలం మహేశ్వరి, ఎస్.నందగోపాల్, ఆర్.రాజు, ఎం.తిలక్, సత్యనారాయణ, భీష్మదేవ్, బి.కృష్ణాగౌడ్, బి.నర్సింగ్యాదవ్, రామారావు, తదితరులు పాల్గొన్నారు.