BRS | హైదరాబాద్ : సిక్కులు ఎంతో గొప్పగా జరుపుకొనే పండుగ బైసాఖీ ఉత్సవం అని మాజీమంత్రి, సనత్ నగర్ MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఖల్సా స్థాపించిన రోజును పురస్కరించుకొని శనివారం అమీర్పేటలోని డీకే రోడ్డులో గల ఎంసీహెచ్ గ్రౌండ్లో సిక్కు సమాజ్ ఆధ్వర్యంలో 325 బైసాఖీ ఉత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు సికింద్రాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్ధి పద్మారావు గౌడ్, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్లు హాజరయ్యారు. ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించిన అనంతరం వారిని గురుద్వార్ ప్రతినిధులు ఘనంగా సన్మానించారు.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ సిక్కు సమాజానికి బైసాఖీ ఉత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి సంవత్సరం బైసాఖీ సందర్బంగా గురుద్వార్లో ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించడం, భారీ ఊరేగింపులు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని పేర్కొన్నారు. బైసాఖీ ఉత్సవం సందర్బంగా అందరు ఒక చోటకు చేరి ఘనంగా జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో గురుద్వార్ అద్యక్షులు దర్శన్ సింగ్, జనరల్ సెక్రెటరీ సురేందర్ సింగ్, సభ్యులు సుమిత్ సింగ్, టిల్లు బాయ్, సురేందర్ సింగ్, బీఆర్ఎస్ నాయకులు కూతురు నర్సింహ, ప్రవీణ్ రెడ్డి, బలరాం తదితరులు పాల్గొన్నారు.