కాప్రా, నవంబర్ 28 : ఉప్పల్ బీఆర్ఎస్ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి విజయాన్ని కోరుతూ వేలాది గులాబీ దండుతో మంగళవారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ కాప్రా, ఈసీఐఎల్, హెచ్బీకాలనీ, నాచారం, హబ్సిగూడల మీదుగా ఉప్పల్ రింగ్రోడ్డు చౌరస్తా, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వరకు కొనసాగింది. అంతకు ముందు కాప్రా పరిధిలోని వివిధ ప్రాంతాల నుంచి గులాబీ జెండాలను అమర్చిన బైక్లపై ర్యాలీగా బయలుదేరిన నాయకులు, కార్యకర్తలు సైనిక్పురిలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు.
ముందుగా సైనిక్పురి చౌరస్తాలో మహాత్మా జ్యోతిరావు ఫులే 133వ వర్ధంతిని పురస్కరించుకొని ఫులే విగ్రహానికి ఉప్పల్ బీఆర్ఎస్ అభ్యర్థి లక్ష్మారెడ్డి, నియోజకవర్గం ఇన్చార్జి రావుల శ్రీధర్రెడ్డి, ఎంబీసీ మాజీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్, ఇతర బీఆర్ఎస్ నాయకులు పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సైనిక్పురి చౌరస్తాలో బీఎల్ఆర్ బైక్ ర్యాలీని ప్రారంభించారు. జై బీఆర్ఎస్, జై కేసీఆర్, జై కేటీఆర్, జై బీఎల్ఆర్ అని బిగ్గరగా నినాదాలు చేస్తూ చేపట్టిన బైక్ ర్యాలీ ఏఎస్రావునగర్ ప్రధాన వీధికి చేరుకోగా.. ఏఎస్రావునగర్, రాధిక చౌరస్తా, ఈసీఎల్ కూడళ్ల వద్ద ఏఎస్రావునగర్, చర్లపల్లి డివిజన్లకు చెందిన గులాబీ దండు బైక్లు ప్రధాన ర్యాలీ తో కలిశాయి. అనంతరం హెచ్బీకాలనీ ప్రధాన రహదారిపై నాలుగవ డివిజన్కు చెందిన బీఆర్ఎస్ బైక్ల ర్యాలీ ప్రధాన ర్యాలీతో కలిసింది. అనంతరం మల్లాపూర్, నాచారం ప్రధాన వీధుల మీదుగా బైక్ల గులాబీ దండు ర్యాలీ కొనసాగింది.
ఈ డివిజన్లకు చెందిన బీఆర్ఎస్ సైనికులు ప్రధాన ర్యాలీతో జతకలిశారు. అనంతరం హబ్సిగూడ, రామంతాపూర్ల మీదుగా ఉప్పల్ రింగురోడ్డు చౌరస్తా, బీఆర్ఎస్ పార్టీకార్యాలయం వరకు ర్యాలీ కొనసాగింది. జయ, జయ నినాదాలతో బండారి లక్ష్మారెడ్డిని గెలిపిద్దామని ర్యాలీలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు బిగ్గరగా అరుస్తూ నినాదాలు చేశారు. ప్రత్యేకంగా అలంకరించిన జీపుపై ఎక్కిన లక్ష్మారెడ్డి కార్యకర్తలకు అభివా దం చేస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా బండా రి మాట్లాడుతూ.. నాయకులు, కార్యకర్తలు ఎంతో శ్రమపడి ఇన్నిరోజులు ప్రచారం నిర్వహించారని, అంతిమం గా ర్యాలీని విజయవంతం చేశారని పేర్కొంటూ అందరికీ ధన్యవాదాలు తెలిపారు. మరో రెండు రోజులు కష్టపడితే ప్రధానమైన ఓటింగ్ ముగుస్తుందని అన్నారు. ప్రతి ఒక్క రూ తమ ఓటు హక్కు వినియోగించుకునేలా అందరికీ అవగాహన కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఎల్ఆర్తోపాటు సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
మల్లాపూర్, మీర్పేట్ హెచ్బీకాలనీ డివిజన్లలో..
మల్లాపూర్, నవంబర్ 28 : బీఆర్ఎస్ ఉప్పల్ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో సైనిక్పురి జ్యోతిరావు ఫులే చౌరస్తా నుంచి ఉప్పల్ వరకు నిర్వహించే బైక్ ర్యాలీలో మల్లాపూర్, మీర్పేట్ హెచ్బీకాలనీ డివిజన్ల కార్పొరేటర్లు పన్నాల దేవేందర్రెడ్డి, జె. ప్రభుదాసు, మాజీ కార్పొరేటర్ జి. శ్రీనివాస్రెడ్డిలు వేలాది మంది బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలతో పాల్గొన్నారు.
చర్లపల్లి డివిజన్ పరిధిలో..
చర్లపల్లి, నవంబర్ 28 : చర్లపల్లి డివిజన్ పరిధిలోని పెద్ద చర్లపల్లి, చిన్న చర్లపల్లి, వెంకట్రెడ్డినగర్, చక్రీపురం, రెడ్డికాలనీ, నాగార్జుననగర్ కాలనీ, కుషాయిగూడ తదితర ప్రాంతాల్లో బీఆర్ఎస్ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డికి మద్దతుగా కార్పొరేటర్ బొంతు శ్రీదేవి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించి.. ఈసీఐఎల్ చౌరస్తాకు తరలివెళ్లారు. ర్యాలీలో నాయకులు నాగిళ్ల బాల్రెడ్డి, నేమూరి మహేశ్గౌడ్, కనకరాజుగౌడ్, పండాల శివకుమార్గౌడ్, నారెడ్డి రాజేశ్వర్రెడ్డి, బొడిగె ప్రభుగౌడ్, సారా అనిల్, శ్రీకాంత్రెడ్డి, రెడ్డినాయక్, సురేశ్రెడ్డి, సానెం రాజుగౌడ్, రాజేశ్ వంశరాజు, జయకృష్ణ, చల్లా వెంకటేశ్, జాన్రెడ్డి, కొమ్ము సురేశ్, కడియాల బాబు, కొమ్ము రమేశ్, కడియాల అని ల్, శ్రావణ్కుమార్, లక్ష్మారెడ్డి, పరశురాం, రాఘవరెడ్డి, మహిపాల్రెడ్డి, నర్సింహాగౌడ్, సుభాష్, మురళి, తన్వీర్, వెంకట్రెడ్డి, నజీర్, పుష్పలత, అలీ, బాల్నర్సింహా, నవనీత, సత్తెమ్మ, లలిత, సోమయ్య, ముత్యాలు, శ్రీనివాస్తో పాటు పెద్ద సంఖ్యలో కాలనీవాసులు పాల్గొన్నారు.
ఏఎస్రావునగర్ డివిజన్ నుంచి…
ఏఎస్రావునగర్ డివిజన్లో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సింగిరెడ్డి సోమశేఖర్రెడ్డి, స్థానిక కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీషాసోమశేఖరెడ్డి, మాజీ కార్పొరేటర్లు పజ్జూరి పావనీమణిపాల్రెడ్డి, కొత్త రామారావు, బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు కాసం మహిపాల్రెడ్డి, కుమారస్వామిల ఆధ్వర్యంలో బీఆర్ఎస్ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డికి మద్దతుగా పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించి ఈసీఐఎల్ చౌరస్తా, సైనిక్పురి చౌరస్తాలకు తరలివెళ్లారు. ర్యాలీలో నాయకులు బేతాల బాల్రాజు, శేర్ మణెమ్మ, సుదర్శన్రెడ్డి, మురళీపంతులు, రహీం, పెంచల సురేందర్రావు, శోభారాణి, గోలి శ్రీనివాస్, దుర్గా, చిన్న, మల్కా రమాదేవి, సజ్జ రామతులసీ, మహ్మద్ బాజీబాషా, బసవయ్య, నాని, బాబుగౌడ్, యాకయ్య, రాజిరెడ్డి, గోవర్ధన్తో పాటు పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు.