బేగంపేట్, అక్టోబర్ 30: అభివృద్ధిలో సనత్నగర్ నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దామని సనత్నగర్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. రాంగోపాల్పేట్ డివిజన్లోని నల్లగుట్టలో జల్సా ఏ హామ్ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. 2014కు ముందు నల్లగుట్ట ప్రాంతంలో అనేక సమస్యలు ఉండేవని, తాను వచ్చిన తర్వాత రోడ్లు, డ్రైనేజీ తదితర అన్ని సమస్యలను పరిష్కరించామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో అత్యధిక సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయని చెప్పారు.
పేదింటి ఆడపడుచుల పెండ్లికి షాదీ ముబారక్ పథకం కింద దేశంలో ఎక్కడా లేని విధంగా లక్ష నూట పదహార్లు ఆర్థిక సహాయం ప్రభుత్వం అందజేస్తున్నదన్నారు. అలాగే మజీద్లలో ఉండే మౌజంలకు గౌరవ వేతనాన్ని అందజేస్తున్నామని చెప్పారు. పేద ముస్లింలు పండగలను గొప్పగా జరుపుకోవాలనే ఉద్దేశంతో రంజాన్ సందర్భంగా నూతన వస్ర్తాలతో కూడిన గిఫ్ట్ ప్యాక్లను ప్రభుత్వం అందజేస్తున్నదనే విషయాన్ని గుర్తు చేశారు. మిగతా పార్టీలలాగా తమది మాటల ప్రభుత్వం కాదని.. చేతల ప్రభుత్వమన్నారు. ఈ కార్యక్రమంలో షఫీ, అబ్దుల్ రహ్మాన్, దావూద్, యాసిన్, రషీద్ తదితరులు పాల్గొన్నారు.