బేగంపేట్ : తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి రావాలని అన్ని వర్గాల ప్రజల కోరుకుంటున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్(Minister Talasani Srinivas Yadav) అన్నారు. శనివారం వెస్ట్మారేడ్పల్లిలోని తన నివాసంలో అమీర్పేట్ డివిజన్ మాజీ కార్పొరేటర్ శేషుకుమారి ఆధ్వర్యంలో 15 మంది కాంగ్రెస్ పార్టీకి రాజీనామా(Resign)చేసి మంత్రి సమక్షంలో బీఆర్ఎస్(BRS) పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఆయన మాట్లాడుతూ ప్రజలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కొనసాగాలని కోరుకుంటున్నారని అన్నారు. అది సీఎం కేసీఆర్(CM KCR) నాయకత్వంలోనే సాధ్యమవుతుందని గుర్తించారని తెలిపారు. రోజురోజుకు బీఆర్ఎస్ పార్టీకి ఆదరణ పెరుగుతుందని, వివిధ పార్టీల నుంచి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని అన్నారు. పార్టీ నాయకులు కార్యకర్తలు గర్వంగా చెప్పుకునే విధంగా ప్రభుత్వం కార్యక్రమాలు అమలు చేస్తుందన్నారు.
సనత్నగర్ నియోజకవర్గం పరిధిలో 50 సంవత్సరాలలో జరగని అభివృద్ధి తొమ్మిదన్నర సంవత్సరాలలో చేసి చూపించామన్నారు. ఇదే కొనసాగాలని నియోజకవర్గం ప్రజల ఆకాంక్ష అన్నారు. తప్పకుండా అత్యధిక మెజార్టీతో హ్యాట్రిక్ సాధిస్తామని అన్నారు. పార్టీలో చేరిన వారిలో కొత్తపత్తి వీరేందర్గౌడ్, రాహుల్ యాదవ్, లక్ష్మణ్ తదితరులు ఉన్నారు.