‘రైతు బంధు అనే పథకాన్ని సృష్టించి రైతులకు పెట్టుబడి సాయాన్ని మొదలుపెట్టిన మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ’ అని సీఎం కేసీఆర్ అన్నారు. తలసరి ఆదాయంలో అన్ని రాష్ర్టాల కంటే తెలంగాణ ముందంజలో ఉన్నదని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ పథకాలు తీసుకొచ్చిందని చెప్పారు. ఆదివారం ఆలేరు, తుంగతుర్తి, కోదాడ ప్రజా ఆశీర్వాద సభల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. ఎన్నికల్లో ఓటు వేసేటప్పుడు ప్రజలు ఎంతో విజ్ఞతతో ఆలోచన చేయాలని, ఏ పార్టీకీ ఓటేస్తే రాష్ట్రం బాగుపడుతదో బాగా ఆలోచించి ఓటు వేయాలని సీఎం కేసీఆర్ సూచించారు. ఎవరో చెప్పిన మాట విని ఆగం కావద్దని, సొంతంగా ఆలోచించి అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. పేదల సంక్షేమం, రైతుల సంక్షేమం, రాష్ట్ర భవిష్యత్ కోసం తపనతో
పనిచేస్తున్న పార్టీ బీఆర్ఎస్ మాత్రమేనన్నారు.