ఎల్బీనగర్ , ఏప్రిల్ 28: ఎల్బీనగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్కు తిరుగులేదని, ఇతర పార్టీలకు స్థానం లేదని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. మల్కాజిగిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డితో కలిసి చంపాపేట డివిజన్లోని వివిధ ప్రాంతాల్లో పర్యటించి..ఓట్లు అభ్యర్థించారు. రాగిడి లక్ష్మారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. తనను ఎంపీగా గెలిపిస్తే ప్రధాన సమస్యలను పార్లమెంటులో ప్రస్తావించి..పరిష్కారం చేస్తానని అన్నారు.