నేరేడ్మెట్, నవంబర్ 25 : బెదిరింపులు.. గూండాగిరిని ప్రదర్శించే మైనంపల్లి హన్మంతరావుకు ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిన నేత మంత్రి కేటీఆర్ను విమర్శించే స్థాయి లేదని మల్కాజిగిరి నియోజకవర్గం బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మర్రి రాజశేఖర్రెడ్డి మండిపడ్డారు. శనివారం నేరేడ్మెట్ డివిజన్ జీకే కాలనీలోని ఫంక్షన్హాల్లో బీఆర్ఎస్ నాయకులు, కార్పొరేటర్లతో కలిసి ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మట్లాడారు. మంత్రి కేటీఆర్పై మైనంపల్లి చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండించారు. రాజకీయ పదవుల కోసం మైనంపల్లి ఎంతకైనా దిగజారుతారని, ఇందుకు ఎమ్మెల్సీ పదవి కోసం కేటీఆర్ కాళ్లు మొక్కిన విషయాన్ని రాజశేఖర్ రెడ్డి గుర్తు చేశారు. బీఆర్ఎస్ పార్టీలో ఎన్నో పదవులను అనుభవించిన మైనంపల్లి ఆయన కొడుకుకు టికెట్ ఇవ్వనందుకు.. బీఆర్ఎస్, కేటీఆర్పై అనుచిత వ్యాఖ్యలు, వ్యక్తిగత దూషణలు చేయడం సరికాదన్నారు. మైక్రోసాఫ్ట్ తదితర దిగ్గజ ఐటీ కంపెనీల ప్రతినిధులతో చర్చలు జరుపుతూ తెలంగాణలో సాఫ్ట్వేర్ రంగాన్ని, ఐటీ ఉద్యోగాల కల్పనకు పెద్దపీఠ వేస్తున్న కేటీఆర్ను విమర్శించే స్థాయి మైనంపల్లికి లేదని స్పష్టం చేశారు.
అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన కేటీఆర్ను విమర్శిస్తున్న మైనంపల్లికి మల్కాజిగిరిలో ఓటర్లు తగిన గుణపాఠం చెప్పడం ఖాయమన్నారు. మైనంపల్లిది నీచమైన వ్యక్తిత్తత్వం.. బెదిరింపులకు పాల్పడే తత్వం.. కబ్జాలను ప్రోత్సహించే నైజం.. త్వరలోనే కా్రంగెస్ పార్టీకి అర్థమవుతుందని, అది చూసి ఎందుకు మైనంపల్లికి టికెట్ ఇచ్చామని ఆ పార్టీ నేతలు బాధపడుతారని, ఆ పార్టే మైనంపల్లిని కాన్బైరి కొడుతుందని ఎద్దేవా చేశారు. స్వార్థం కోసం కా్రంగెస్ పార్టీలో చేరిన మైనంపల్లి, ఆయన కొడుకు ఎమ్మెల్యే టికెట్ల కోసం సూట్ కేసులను అందచేశారని విమర్శించారు. మైనంపల్లి కన్నుపడితే ఖాళీ స్థలాలు కబ్జాకు గురవుతాయనే భయంతో వాటికి స్థానికులు బ్లూషెడ్ వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో ప్రతిపక్షాలపై పాలసీపరమైన విమర్శలు చేయకుండా వ్యక్తిగతంగా విమర్శలు చేయడాన్ని రాజశేఖరరెడ్డి తప్పుబట్టారు. మల్కాజిగిరి ప్రజలు బీఆర్ఎస్ వైపే ఉన్నారని, చిల్లరమల్లర విమర్శలు చేస్తున్న మైనంపల్లికి ఓటమి తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంబీసీ చైర్మన్ నందికంటి శ్రీధర్, కార్పొరేటర్లు మీనా ఉపేందర్రెడ్డి, మేకల సునీతా రాముయాదవ్, సబిత, జవహార్నగర్ కార్పొరేటర్ మురుగేశ్, సీనియర్ నాయకులు బద్దం పరశురాంరెడ్డి, రావుల అంజయ్య, వెంకన్న, కరంచంద్, జీవగన్, జీకే హన్మంతరావు, మధుసూదన్రెడ్డి, ఉపేందర్రెడ్డి, దార శ్రీనివాస్రెడ్డి, నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.