ఎల్బీనగర్, నవంబర్ 10 : నిజామాబాద్లో చెల్లని రూపాయి హైదరాబాద్లో చెల్లుతుందా అని, నిజామాబాద్ ప్రజలు తరిమికొడితే ఇక్కడికి వచ్చి పడ్డ కాంగ్రెస్ నాయకుడిని ప్రజలు ఆదరించరని ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. శుక్రవారం ఉదయం చైతన్యపురి డివిజన్లోని మున్సిపల్ కాలనీ, ఇందిరానగర్తో పాటుగా పరిసర కాలనీల్లో బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు నీరాజనాలు పలికారు. స్థానిక నాయకులు ప్రచారంలో భాగంగా సుధీర్రెడ్డిపై పూలవర్షం కురిపించారు.
మహిళలు హారతులు ఇచ్చి ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలుకడంతో పాటుగా బీఆర్ఎస్కే మద్దతు ఇస్తామంటూ హమీ ఇచ్చారు. ఈ సందర్భంగా దేవిరెడ్డి సుధీర్రెడ్డి మాట్లాడుతూ ఎల్బీనగర్ నియోజకవర్గంలో దొంగలకు, కజ్జాకోరులకు, మోసకారులకు స్థానం లేదన్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గంపై అవగాహన కూడాలేని కొత్త మొహాలు వస్తున్నాయని, వారికి స్థానం లేకుండా చేయాలన్నారు.
ఎల్బీనగర్ ని యోకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ది పథంలో ముం దుకు తీసుకుని పోతున్నానని, అభివృద్దిని చూసి ఆశీర్వదించి కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు. కాంగ్రెస్ అభ్యర్థి మధుయాష్కీ గౌడ్ దొంగ డాక్యుమెంట్లు, దొంగ వీసాలతో విద్యార్థులను మోసం చేశాడని 420 కేసులు ఉన్నాయంటూ గోనె ప్రకాశ్రావు ఆరోపణలు చేశాడని, అదే రీతిలో బీజేపీ నాయకుడికి కూడా పలు మోసాల్లో చోటు ఉందని, సొంత కుటుంబ సభ్యులను కూడా మోసం చేశాడన్నారు.
ఎల్బీనగర్, నవంబర్ 10 : ఎల్బీనగర్ నియోకవర్గం అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్దే గెలుపని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి దేవిరెడ్డి సుధీర్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎల్బీనగర్ నియోకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి దేవిరెడ్డి సుధీర్రెడ్డి చైతన్యపురిలో జోరుగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సుధీర్రెడ్డి మాట్లాడుతూ అభివృద్ధి చేసే నాయకులను ఆదరించి ఎన్నుకోవాలన్నారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ జిన్నారం విఠల్రెడ్డి, సొంటి చంద్రశేఖర్రెడ్డి, డివిజన్ అధ్యక్షుడు తోట మహేశ్యాదవ్, కోతి నర్సిరెడ్డి, పవన్, శరత్చంద్ర, నరేశ్, చిన్నా యాదవ్, జలందర్, నాగలక్ష్మి, జ్యోతి, జయశ్రీ, పావని, సంగీత, అనిత, గట్టు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
హయత్నగర్, నవంబర్ 10 : ఎల్బీనగర్ నియోజకవర్గం అభివృద్ధి, సంక్షేమం కోసం నిరంతరం పాటుపడుతున్న బీఆర్ఎస్ బలపరిచిన ఎమ్మెల్యే అభ్యర్థి దేవిరెడ్డి సుధీర్రెడ్డిని కారు గుర్తుకు ఓటువేసి భారీ మెజార్టీతో గెలిపించాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఓరుగంటి వెంకటేశ్ గౌడ్ పిలుపునిచ్చారు. శుక్రవారం హయత్నగర్ డివిజన్లోని ఓల్డ్ విలేజీ, ద్వారకామయినగర్ కాలనీల్లో ఇంటింటికీ బీఆర్ఎస్ ప్రచార కార్యక్రమంలో ఓరుగంటి వెంకటేశ్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎల్బీనగర్ నియజకవర్గంలో ప్రధానమైన భూరిజిస్ట్రేషన్ల సమస్యను 118 జీవో ద్వారా పరిష్కరించారని తెలిపారు.
మన్సూరాబాద్, నవంబర్ 10: బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డికి మద్దతుగా మన్సూరాబాద్ డివిజన్ పరిధి హైవేకాలనీ, సరస్వతీనగర్, మధురానగర్కాలనీల్లో శుక్రవారం మాజీ కార్పొరేటర్ కొప్పుల విఠల్రెడ్డి, డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు ఇంటింటా తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించి కారు గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు.