సిటీబ్యూరో, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ మహా నగరంలోని ఓటర్లు అభివృద్ధి ఎజెండాగా ఎన్నికల తీర్పు ఇచ్చారు. ఆనవాయితీగానే పని చేసిన పార్టీ వైపు మొగ్గు చూపారు. 2014లో ఎన్నికలు జరిగాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో 15 నియోజకవర్గాలు, ఉమ్మడి రంగారెడ్డిలోని 14 నియోజకవర్గాలు… మొత్తం 29 నియోజకవర్గాల్లో సుమారు 93,03,448 మంది ఓటర్లు ఉండగా… 50,53,181 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. అంటే 54.31 శాతం పోలింగ్ నమోదైంది. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కేవలం నాలుగు స్థానాలు మాత్రమే కైవసం చేసుకుంది. తెలుగుదేశం పార్టీ 11, కాంగ్రెస్ రెండు, బీజేపీ ఐదు స్థానాల్లో గెలవగా… మజ్లిస్ ఏడు స్థానాలను గెలుచుకుంది. ఓట్ల వాటా చూస్తే.. బీఆర్ఎస్ 22.57 శాతం, టీడీపీ 20.90 శాతం, కాంగ్రెస్ 16.81 శాతం, బీజేపీ 12.39 శాతం, మజ్లిస్ 15.53 శాతంగా ఉన్నాయి.