జగద్గిరిగుట్ట, ఫిబ్రవరి 8: పతంగి కోసం వెళ్లి కరెంట్ షాక్ తగిలి ఓ బాలుడికి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటన జగద్గిరిగుట్ట పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కూకట్పల్లి సమీపం ప్రగతినగర్కు చెందిన నరసింహ కుమారుడు రాహుల్(6) ఆదివారం సాయంత్రం ఇంటి సమీపంలో ఆడుకుంటున్నాడు. గాలిపటం సమీపంలోని రక్షణలేని ట్రాన్స్ఫార్మర్కు చిక్కుకోవడంతో దాన్ని తీసుకునేందుకు వెళ్లి విద్యుత్ షాక్కు గురయ్యాడు. తీవ్రంగా గాయపడిన బాలుడిని ఓప్రైవేటు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు. తగినంత ఎత్తు, సరైన కంచె లేని ట్రాన్ఫార్మర్ కావడంతోనే ప్రమాదం జరిగినట్టు స్థానికులు తెలిపారు.