హైదరాబాద్ : ఎల్బీనగర్ మన్సూరాబాద్లో విషాదం అలుముకున్నది. కారు కిందపడి ఏడాదిన్నర బాలుడు మృతి చెందాడు. తండ్రి నడుపుతున్న కారు చక్రాల కిందే పడి బాలుడు మృత్యుఒడికి చేరడం స్థానికంగా విషాదం అలుముకున్నది. లక్ష్మణ్ అనే వ్యక్తి అపార్ట్మెంట్లో వాచ్మెన్గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలోనే కారును వాష్ చేసి అపార్ట్మెంట్లో పెడుతున్న సమయంలో కారు ముందుభాగంలోకి అకస్మాత్తుగా వచ్చాడు. దీంతో తీవ్ర గాయాలు కావడంతో బాలుడు మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. తండ్రి నడుతుపుతున్న కారు కిందే బాలుడు మృతి చెందడం స్థానికంగా విషాదం అలుముకోగా.. తల్లీదండ్రుల రోధనలు అందరినీ కలచివేశాయి.