బండ్లగూడ, ఫిబ్రవరి 21: వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఆరు నెలల బాబు మృతి చెందాడు. ఈ ఘటన రాజేంద్రనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. వివరాల్లోకి వెళ్తే.. బండ్లగూడ వికాస్నగర్లో ఉండే విష్ణువర్ధన్, అశ్విని దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఆరు నెలల బాబు ఉన్నాడు. శనివారం మధ్యాహ్నం సమయంలో బాబుకు జ్వరం రావడంతో స్థానికంగా ఉన్న క్రేయా న్స్ ఆస్పత్రికి తరలించారు.అక్కడ రామును పరిశీలించిన వైద్యులు గడువు ముగిసిన ఇంజక్షన్ ఇచ్చిన కొద్ది సేపటికే మృతి చెందాడు. బాబు మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆరోపించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. బాలుడి తండ్రి విష్ణువర్ధన్రెడ్డి ఇచ్చిన పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.