Boy | సోషల్ మీడియా ప్రభావం ప్రాణాల మీదికొస్తుంది. నెట్టింట రీల్స్ చేస్తూ ప్రమాదాల బారిన పడ్డ ఘటనలు ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి. రీల్స్ పిచ్చి ఓ బాలుడి ప్రాణాలు తీసుకుంది. హైదరాబాద్ నాచారం మల్లాపూర్ గాంధీ బొమ్మ దగ్గర బస్తీలో ఉండే బాలుడు మితున్ (14) ఫేమస్ అవ్వాలనుకున్నాడు. ఇన్ స్ట్రాగ్రామ్లో స్కిట్స్ వేసి బాల్కనీ రైలింగ్ పిట్ట గోడపై రీల్స్ చేసే క్రమంలో ప్రమాదవశాత్తు కింద పడ్డాడు.
ఈ విషయాన్ని గమనించిన కుటుంబసభ్యులు మితున్ను వెంటనే ఆస్పత్రికి తరలించారు. బాలుడు మితున్ ఆస్పత్రిలో చికిత్ప పొందుతూ ప్రాణాలు విడిచాడు. మితున్ మృతితో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. కాలనీలో విషాదచాయలు అలుముకున్నాయి.
బాలుడి ప్రాణాలు తీసిన రీల్స్ పిచ్చి
హైదరాబాద్ నాచారం మల్లాపూర్ గాంధీ బొమ్మ దగ్గర బస్తీలో ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేస్తూ ఫేమస్ అవ్వాలని రిస్కీ స్కిట్స్ చేసి ప్రాణాలు పోగొట్టుకున్న బాలుడు మితున్ (14)
బాల్కనీ రైలింగ్ పిట్ట గోడపై రీల్స్ చేస్తూ పొరపాటున కిందపడి తీవ్రంగా గాయపడిన బాలుడు… pic.twitter.com/dj3t19W8IE
— Telugu Scribe (@TeluguScribe) April 21, 2026
Hot Adilabad | ప్రపంచంలోని అత్యంత వేడి నగరాల్లో ఒకటిగా ఆదిలాబాద్
Jailer 2 | ఎట్టకేలకి జైలర్ 2 షూటింగ్ పూర్తి.. రజనీకాంత్ అభిమానుల్లో పెరిగిన అంచనాలు
Earthquake | ఈశాన్య రాష్ట్రాల్లో భూకంపం.. పలు రాష్ట్రాల్లో ప్రకంపనలు