సిటీబ్యూరో, మే 24(నమస్తే తెలంగాణ) : కుటుంబంలోని కలహాలు ఆఫీసులో చెప్పుకుం టే తీరుతాయని నమ్మింది. కాని అవతలి వ్య క్తులే లోబర్చుకునే ప్రయత్నం చేస్తారని ఊహించలేదు. వివరాల్లోకి వెళితే.. నేరేడ్మెట్ ప్రాంతానికి చెందిన ఉద్యోగిని గచ్చిబౌలిలో ని ఓ ఫైనాన్సియల్ సర్వీసెస్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నది. అయితే ఆమెకు ఇంట్లో భర్తతో కలహాలు రావడంతో ఈ విషయాలను ఆఫీసులో మేనేజర్కు చెప్పింది.
ఇదే అదునుగా భావించిన మేనేజర్ ఆమెను ఓదార్చుతున్నట్లు నటిస్తూ.. లోబర్చుకోవాలని చూశాడు. తన కోర్కెలు తీర్చాలని కోరాడు. అందుకు బాధితురాలు ఒప్పుకోక పోవడంతో ఆఫీసులో టీంతో కలిసి పనిచేసిన సమయంలో దిగిన ఫొటోలను బాధితురాలి కుటుంబ సభ్యులతో పాటు భర్తకు పంపిస్తానని బెదిరించాడు. దీంతో బాధితురాలు ఉద్యోగానికి రాజీనామా చేసింది. అయినా మేనేజర్ వేధింపులు ఆపలేదు. దీంతో బాధితురాలు సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించింది. వేధింపులకు గురిచేస్తున్న మేనేజర్పై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసును నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు.