ఉస్మానియా యూనివర్సిటీ, జూలై 23: తార్నాక డివిజన్లోని లాలాపేట పోచమ్మ దేవాలయంలో నిర్వహించబోయే బోనాల జాతరకు రావాలని ఆలయ కమిటీ సభ్యులు, డిప్యూటీ స్పీకర్ పద్మారావును కోరారు. ఈ సందర్భంగా ఆయన జాతరకు తగిన ఏర్పాట్లు చేయవలసిందిగా అధికారులను ఆదేశించారు. బోనాలు సజావుగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ సభ్యులు కిషన్శర్మ, సునీల్ ముదిరాజ్, బాలయాదవ్, అమర్గౌడ్, కిరణ్గౌడ్, శ్రీను, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.