సుల్తాన్బజార్, ఫిబ్రవరి 16: రక్త దానం ఎంతో మహోత్తరమైన కార్యక్రమమని, ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి పునర్జన్మను ప్రసాదించేదని రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా నాంపల్లి గృహకల్ప ఆవరణలోని టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా శాఖ కార్యాలయంలో టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా శాఖ అధ్యక్షుడు డాక్టర్ ఎస్ఎం ముజీబ్హుస్సేనీ నేతృత్వంలో గురువారం నిర్వహించిన 7వ మెగా రక్త దాన శిబిరాన్ని మంత్రులు మహమూద్ అలీ, వి.శ్రీనివాస్గౌడ్, వక్ఫ్బోర్డు చైర్మన్ మసిఉల్లాఖాన్, ది న్యూస్ ఎడిటర్ మహ్మద్ నిజాముద్దీన్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా రక్త దానం చేసి అందరిలో ఉత్సాహాన్ని నింపారు. అనంతరం మంత్రులు మాట్లాడుతూ సబ్బండ వర్గాల అభ్యున్నతికి నిరంతరం పాటు పడే సీఎం కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా మెగా రక్తదాన శిబిరం నిర్వహించడం అభినందనీయమన్నారు. తలసేమియా వ్యాధిగ్రస్థులకు, రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి రక్తాన్ని అందించేందుకు ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. పెద్ద ఎత్తున పాల్గొని రక్తదానం చేసిన ఉద్యోగులకు ఎస్ఎం ముజీబ్హుస్సేనీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మెగా రక్తదాన శిబిరంలో సుమారు 700 యూనిట్ల రక్తాన్ని సేకరించినట్లు చెప్పారు.
ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ కార్పొరేటర్ నర్సింహాయాదవ్, మాజీ కార్పొరేటర్ మమతా సంతోష్ గుప్తా, టీఆర్ఎస్ నాయకులు సంతోష్ గుప్తా, టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు మామిళ్ళ రాజేందర్, ప్రధాన కార్యదర్శి రాయకంటి ప్రతాప్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డీఐజీ ఎం.సుభాషిణి, హైదరాబాద్ జిల్లా డీఐజీ ట్వింకిల్ జాన్, జిల్లా రిజిస్ట్రార్ వల్లీ సుబ్బలక్ష్మి, టీఎన్జీవో కేంద్ర సంఘం కోశాధికారి రామినేని శ్రీనివాస్రావు, ఉపాధ్యక్షులు ఉమాదేవి, కార్యదర్శి గరిగబోయిన చంద్రశేఖర్, హైదరాబాద్ జిల్లా శాఖ కార్యదర్శి ఎస్.విక్రమ్కుమార్, కోశాధికారి జె.బాలరాజు,
అసోసియేట్ అధ్యక్షుడు కేఆర్ రాజ్కుమార్, ఉపాధ్యక్షులు ఉమర్ఖాన్, కురాడి శ్రీనివాస్, ఎస్.మురళీరాజ్, ప్రచార కార్యదర్శి వైదిక్ శస్త్ర, సంయుక్త కార్యదర్శి ఖాలేద్ అహ్మద్, సభ్యులు శంకర్, గీత సింగ్, జానకి, సుజాత, వెంకట్రెడ్డి, జిల్లా శాఖ మాజీ కార్యదర్శులు ప్రభాకర్, దేవేందర్, వెంకటేశ్, ఈఎన్టీ యూనిట్ అధ్యక్షుడు తూముకుంట రాజు, ఎంఎన్జే క్యాన్సర్ దవాఖాన యూనిట్ సభ్యులు శివకుమార్, మిత్రులు ఉస్మాన్ అలీ ఉస్మానీ, రామకృష్ణారెడ్డి, మహ్మద్ ముస్తఫాతో పాటు 60 యూనిట్ల అధ్యక్ష, కార్యదర్శులు, ప్రాథమిక సభ్యులు, సిటీ కళాశాల, ఖైరతాబాద్ డిగ్రీ కళాశాల ఎస్సీసీ క్యాడెట్లు, ఐటీఐ విద్యార్థులు, ఇందిరా ప్రియదర్శిని మహిళా డిగ్రీ ప్రభుత్వ కళాశాల విద్యార్థిణులు, హైదరాబాద్ యూత్ ఫోర్స్ సభ్యులు, పీపుల్ హెల్పింగ్ చిల్డ్రన్స్ సంస్థ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.