కుత్బుల్లాపూర్, నవంబర్ 29 : దీక్షా దివాస్ సందర్భంగా తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ యువజన విభాగం ఆధ్వర్యంలో బుధవారం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్, బీఆర్ఎస్ పార్టీ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు శంభీపూర్రాజు, రాష్ట్ర మంత్రి కేటీఆర్తో కలిసి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు, యువకులు పాల్గొన్నారు.