బంజారాహిల్స్,ఆగస్టు 8: ఖైరతాబాద్ డివిజన్ వెంకటరమణకాలనీ, ఆనంద్నగర్ కాలనీలకు చెందిన పలువురు బీజేపీ కార్యకర్తలు సోమవారం టీఆర్ఎస్లో చేరారు. ఎమ్మెల్యే దానం నాగేందర్ పార్టీలో చేరిన వారికి గులాబీ కండువాలు కప్పి స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేరుతున్నారన్నారు. పార్టీలో చేరిన ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు ఉంటుందన్నారు. పార్టీలో చేరిన వారిలో మోత్కూరు ముకుల్స్వామి, సల్మాన్, గౌతమ్,ఈశ్వర్ నాయక్, శ్రవణ్, అరవింద్ తదితరులు ఉన్నారు.