MLA Rajasingh | హైదరాబాద్ : గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్పై విధించిన సస్పెన్షన్ను తొలగించడంపై ఇంకా జాప్యం కొనసాగుతోన్న విషయం తెలిసిందే. రాజాసింగ్ సస్పెన్షన్ విషయంలో బీజేపీ అధిష్టానం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే రాజాసింగ్ సస్పెన్షన్పై జాప్యానికి ప్రధాన కారణం.. ఆయన గోషామహల్ స్థానాన్ని ఖాళీ చేయకపోవడమేనని తెలుస్తోంది.
గోషామహల్ స్థానాన్ని వదులుకొని, 2024 సార్వత్రిక ఎన్నికల్లో జహీరాబాద్ లోక్సభ సెగ్మెంట్ నుంచి పోటీ చేయాలని రాజాసింగ్పై బీజేపీ అధిష్టానం తీవ్ర ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. జహీరాబాద్ లోక్సభ స్థానం నుంచి పోటీకి ఒప్పుకుంటేనే సస్పెన్షన్ తొలగించే అంశంపై ఓ నిర్ణయం తీసుకుంటామని అధిష్టానం రాజాసింగ్కు సూచించినట్లు తెలుస్తోంది. అందుకే ఆయన సస్పెన్షన్పై జాప్యం జరుగుతోందని గుసగుసలు వినపడుతున్నాయి.
గోషామహల్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున మాజీ మంత్రి, దివంగత ముకేశ్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ను పోటీ చేయాలని పార్టీ భావిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో గోషామహల్ను వదిలిపెట్టాలని రాజాసింగ్కు అధిష్టానం సూచించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే పార్టీ అధిష్టానం డిమాండ్కు రాజాసింగ్ అంగీకరించలేదని, గోషామహల్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని ఆయన నిర్ణయించుకున్నట్లు సమాచారం. గోషామహల్ నియోజకవర్గంలో రాజాసింగ్కు మంచి పట్టుంది. మద్దతుదారులు కూడా ఈ నియోజకవర్గాన్ని వదిలి ఎక్కడికి వెళ్లొద్దని ఆయనకు సూచించినట్లు సమాచారం. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున గెలుపొందిన ఏకైక వ్యక్తి రాజాసింగ్ మాత్రమే.