బడంగ్పేట, అక్టోబర్16: సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై గులాబీ పార్టీలో చేరుతున్నారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలోని రావిర్యాల, మంఖాల్కు చెందిన బీజేపీ ,టీడీపీలకు చెందిన నాయకులు మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో సోమవారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి మంత్రి బీఆర్ఎస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తుక్కుగూడ పరిధిలోని ప్రజయ్ క్లబ్ హౌస్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి సబితాఇంద్రారెడ్డి మాట్లాడుతూ కులమతాలకతీతంగా పనిచేస్తున్న సీఎం కేసీఆర్కు ప్రజలు అండగా ఉండవలసిన అవసరం ఉందన్నారు. గడప గడపకు సంక్షేమ పథకాల ఫలాలు అందుతున్నాయన్నారు. పార్టీలో చేరిన వారికి సముచిత స్థానం ఉంటుందన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్స్ బూడిద తేజస్వీని, రవినాయక్, సుమన్ లావణ్య , రాజు, మాజీ సర్పంచ్ నర్సింహారెడ్డి, మాజీ ఎంపీటీసీ సురేశ్, శ్రీనివాస్, బషీర్, సామేల్ రాజు, తదితరులు పాల్గొన్నారు.