బేగంపేట్, అక్టోబర్ 11 ;వెస్ట్ మారేడ్పల్లిలోని తన నివాసంలో బుధవారం మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ సమక్షంలో బీజేపీ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారిలో మాజీ కార్పొరేటర్ అత్తెల్లి మల్లిఖార్జున్గౌడ్, మతిన్ మురళి, హీరాలాల్, ఉమర్, అంగమోతి శ్రీనివాస్, మాలవి, సంతోష్కన్నా, తదితరులు ఉన్నారు. వీరి వెంట బన్సీలాల్పేట్కు చెందిన డివిజన్ అధ్యక్షుడు వెంకటేశం రాజు తదితరులు ఉన్నారు.