గోల్నాక, జూలై 20: అంబర్పేట నియోజకవర్గంలో గురువారం పలు పార్టీలకు చెందిన నాయకులు బీఆర్ఎస్లో చేరారు. గోల్నాకలోని క్యాంపు కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బాగ్అంబర్పేట డివిజన్ విజ్ఞాన్పురి కాలనీకి చెందిన బీజేపీ కిసాన్ మోర్చా నగర కార్యదర్శి బి.రఘురాంరెడ్డి, రమేశ్ గౌడ్, కాచిగూడకు చెందిన ఎ.లక్ష్మణ్గౌడ్, అంబర్పేటకు చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు బ్రహ్మచారి తదితరులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరిని అంబర్పేట డివిజన్ కార్పొరేటర్ ఈ.విజయ్కుమార్గౌడ్తో కలిసి ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అంబర్పేట నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ప్రధానంగా బీజేపీతోపాటు ఇతర పార్టీల నాయకులు బీఆర్ఎస్లో చేరుతున్నారని అన్నారు.
గత పాలకుల నిర్లక్ష్యంతో నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోలేదని ఆరోపించారు. నాలుగున్నరేండ్లలో నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందినట్లు తెలిపారు. ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ వంటి పథకాలను అర్హులకు అందజేయడంతో పాటు ఆపత్కాలంలో సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆదుకునేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. కష్టపడే ప్రతి నాయకుడికి పార్టీలో తగిన ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.