ఘట్కేసర్,సెప్టెంబర్ 19: బీజేపీ పార్టీకి రాష్ట్రంలో ప్రజాదరణ లేదని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. ఘట్కేసర్ మున్సిపాలిటీ శివారెడ్డిగూడలోని బంధన్ ఫంక్షన్ హాల్లో టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి పాల్గొన్నారు. ఆయన సమక్షంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు కందకట్ల మాధవరెడ్డి, మాజీ సర్పంచ్ పెర్సిబాయి, రాజేశ్,రహీం, అభిమన్యూ,గజ్జల రాజేశ్, మహిళలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారందరికీ మంత్రి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ దేశంలో బీజేపీ ప్రభుత్వం నిత్యావసరాల ధరలు పెంచుతూ సామాన్యుల నడ్డివిరుస్తున్నదని అన్నారు.
దళితబంధు, త్వరలో అమలు చేయబోయే గిరిజన బంధు వంటి పథకాలతో టీఆర్ఎస్ పార్టీ, సీఎం కేసీఆర్కు తెలంగాణ ప్రజల ఆదరణ పెరిగిందని అన్నారు. రాష్ట్రంలో కొత్తగా 47లక్షల మందికి ఆసరా పింఛన్లు పంపిణీ చేసిన కేసీఆర్ను వృద్ధులంతా తమ ఇంటి పెద్దకొడుకుగా అభివర్ణిస్తున్నారని ఆయన అన్నారు.అంతకు ముందు మంత్రి మల్లారెడ్డి ఘట్కేసర్లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దాదాపు కిలోమీటర్ మేర నాయకులు, కార్యర్తలతో ర్యాలీ నిర్వహించారు.కార్యక్రమంలో నియోజకవర్గ టీఆర్ఎస్ నాయకుడు భద్రారెడ్డి, చైర్మన్లు ఎం.పావని జంగయ్య యాదవ్, కొండల్రెడ్డి, కౌన్సిలర్లు,సోసైటీ చైర్మన్ రాంరెడ్డి, పోచారం టీఆర్ఎస్ అధ్యక్షుడు సురేందర్ రెడ్డి,ఘట్కేసర్ టీఆర్ఎస్ ఉపాధ్యక్షుడు పి.వెంకటేశ్వరావు, సర్పంచుల సంఘం అధ్యక్షుడు, కొర్రెముల సర్పంచ్ వెంకటేశ్ గౌడ్, నాయకులు దాసు, అంజిరెడ్డి, ప్రభాకర్ రెడ్డి, ఎం.జంగయ్య యాదవ్,ప్రజలు టీఆర్ఎస్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.సీఐ ఎన్. చంద్రబాబు, ఎస్ఐ నాగార్జున రెడ్డి బందోబస్తు నిర్వహించారు.