బడంగ్పేట, నవంబర్6: ముఖ్య మంత్రి కేసీఆర్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులు గులాబీ గూటికి చేరుతున్నారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సిర్లాహిల్ప్, ప్రశాంత్ హిల్స్ కాలనీకి చెందిన బీజేపీ, కాంగ్రెస్ నాయకులు డిప్యూటీ మేయర్ తీగల విక్రంరెడ్డి, కార్పొరేటర్ ధనలక్ష్మి రాజ్కుమార్, నవీన్ గౌడ్ ఆధ్వర్యంలో మంత్రి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మంత్రి వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహేశ్వరం నియోజక వర్గం వ్యాప్తంగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఖాళీ అవుతున్నాయని అన్నారు. ఆ పార్టీలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. అభివృద్ధికి పట్టం కట్టాలన్న ఆలోచనలో ప్రజలు ఉన్నారన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వతోనే అభివృద్ధి సాధ్యం అవుతుందని ప్రజలు నమ్ముతున్నారన్నారు. ప్రతి గడపకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు.
ముఖ్య మంత్రి కేసీఆర్ నాయకత్వాన్ని అన్ని వర్గాల ప్రజలు కోరుకుంటున్నారన్నారు. ప్రజా సంక్షేమానికి కట్టు బడి పనిచేస్తున్నామని అందుకే ప్రజలు బీఆర్ఎస్ పార్టీ పై విశ్వాసం చూపుతున్నారన్నారు. కారు గుర్తుకు ఓటు వేసి మరోసారి బీఆర్ఎస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపిస్తామన్నారు. పెయింటింగ్ అసోసియేషన్, వివిధ కుల సంఘాల నాయకులు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నారన్నారు. చందు, విఠల్, కన్న, రఘు, రాము, సురేశ్, పండు, రాజు, రాజేశ్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, రాజేశ్, కాంత్రి, నందు, రాహుల్, వినోద్, విజయ్, శెశైలం, శేఖర్ యాదవ్, కార్తీక్, సాయి, తదితరులు పార్టీలో చేరిన వారిలో ఉన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ తీగల విక్రంరెడ్డి, రాజ్ కుమార్, కోఆప్షన్ పల్లె జంగయ్య గౌడ్, ప్రవీన్, కృష్ణ తదితరులు ఉన్నారు.
మంత్రి సబితా ఇంద్రారెడ్డి గెలుపు ఖాయం
కందుకూరు, నవంబర్ 6 మంత్రి సబితా ఇంద్రారెడ్డి గెలుపు ఖాయమని జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, మాజీ ఎంపీపీ వట్నాల శోభ ఈశ్వర్గౌడ్ తెలిపారు. మండల పరిధిలోని బాచుపల్లి, ఊట్లపల్లి, పంతులు తండా, సార్లరావులపల్లి, బండమీది తండాల్లో ఇంటింటికీ వెళ్లి ప్రచారం నిర్వహించారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డిని గెలిపిస్తే పేద ప్రజల సంక్షేమం కోసం పని చేస్తుందని అన్నారు. కాంగ్రెస్, బీజేపీల నాయకులు ప్రజలకు మాయమాటలు చెప్పి ఓట్లు వేయించుకున్న అనంతరం ముఖం చాటేస్తారని అందుకోసం వారి మాటలను నమ్మి మోసపొవద్దని కోరారు. సబితా ఇంద్రారెడ్డి గెలుపు కోసం పని చేస్తే నిరంతరం ప్రజల మధ్యన ఉంటూ సమస్యల పరిష్కారం కోసం పని చేస్తుందన్నారు. కార్యక్రమంలో బాచుపల్లి సర్పంచ్ శ్రీనివాస్, ఎంపీటీసీ సురేశ్, జైత్వా రం మాజీ సర్పంచ్ పర్వతాల్ యాదవ్, మండల వర్కి ంగ్ ప్రెసిడెంట్ ఎలుక మేఘనాథ్రెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షుడు నర్సింహ, యూత్ అధ్యక్షుడు నరేశ్, పాల్గొన్నారు.
అభివృద్ధికే పట్టం కట్టండి
మహేశ్వరం, నవంబర్ 6: నియోజక వర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి పట్టం కట్టాలని పీఏసీఎస్ చైర్మన్ మంచె పాండు యాదవ్ అన్నారు. సోమవారం అమీర్పేట్, మాణిక్యమ్మగూడ, చిన్న తూప్ర గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ ఇంటింటికీ ప్రచారంలో నియోజక వర్గ కార్యదర్శి గుండెమోని అంజయ్య ముదిరాజ్తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నాయకత్వంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రత్యేక చొరవతో మహేశ్వరం నియోజక వర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారని అన్నారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు రాజకీయాలకు అతీతంగా ప్రతి గడపకు అందుతున్నాయని అన్నారు. మంత్రి చేస్తున్న అభివృద్ధి పనులే ఆమె గెలుపునకు బాటలు పడుతాయని అన్నారు. కార్యక్రమంలో పీఏసీఎస్ వైస్ చైర్మన్ వెంకటేశ్వర్రెడ్డి, బీసీసెల్ మండల అధ్యక్షుడు రాఘవేందర్గౌడ్ నాయకులు మంత్రి రాజేశ్, అంబయ్యయాదవ్, సుధాకర్రెడ్డి, కిష్టయ్యపాల్గొన్నారు.