చిక్కడపల్లి : గాంధీనగర్ డివిజన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడకలు ఘనంగా నిర్వహించారు. టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు ముఠా నరేశ్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్ను ఎమ్మెల్యే ముఠా గోపాల్ కట్ చేశారు. అనంతరం మాజీ కార్పొరేటర్ ముఠా పద్మనరేశ్ తో కలిసి పండ్లు పంపిణీ చేశారు.
అదే విధంగా వివేక్నగర్లోని శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యువజన విభాగం నాయకుడు ముఠా జయసింహ, పార్టీ డివిజన్ అధ్యక్షుడు రాకేశ్, శ్రీకాంత్, గడ్డమీద శ్రీనివాస్, మారిశెట్టి నర్సింగ్ రావు, శ్రీనివాస్ గుప్తా, గుండు జగదీశ్, పున్న సత్యనారాయణ, రవి శంకర్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.
చీరల పంపిణీ…
సీఎం కేసీఆర్ జన్మదిన సందర్భంగా నాయిని నర్సింహా రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో గురువారం బాగ్లింగంపల్లిలోని వీఎస్టీ ఫంక్షన్ హాల్లో పారుశుద్ధ్య కార్మికులకు,ఆశ వర్కర్లకు మాజీ కార్పొరేటర్, పార్టీ సీనియర్ నాయకుడు వి.శ్రీనివాస్ రెడ్డి చీరలు పంపిణీ చేశారు. .అదే విధంగా మైనార్టీ గురుకుల పాఠశాలలో సీఎం కేసీఆర్ జన్మనది వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో రేషం మల్లేశ్, శ్యామ్, సిరిగిరి కిరణ్ కుమార్, వీర స్వామి,కార్తీక్ యాదవ్, జావిద్ ఖాన్, వాసీద్ అలీ, కల్పన, కల్యాన్ నాయక్, కుమార్ నాయక్, నందు నాయక్, సత్యనారాయణ, సబితా తదితరులు పాల్గొన్నారు.