ఎల్బీనగర్, ఆగస్టు 20 : సీఎం రిలీఫ్ ఫండ్తో ఎంతో మంది పేదలకు లబ్ధి చేకూరుతుందని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ ఛైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. కొత్తపేట డివిజన్ శ్రీ శంకర్ నగర్క కాలనీ అగాపే చర్చికి చెందిన జోసెఫ్కు రూ. 60 వేల సీఎంఆర్ఎఫ్ చెక్కును ఎమ్మెల్యే సుధీర్రెడ్డి అందజేశారు.
ఈ సందర్భంగా పేదలకు నాణ్యమైన అధునాతన వైద్య సేవలను పొందేందుకు సీఎం సహాయనిధి దోహదపడుతోందన్నారు. దీనిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో సీనియర్ టీఆర్ఎస్ నాయకుడు మహేష్రెడ్డి, జైపాల్ తదితరులు పాల్గొన్నారు.