బంజారాహిల్స్, సెప్టెంబర్ 3: మతం పేరుతో యువతను రెచ్చగొట్టే వారిపట్ల అప్రమత్తంగా ఉంటూ హైదరాబాద్ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న బీఆర్ఎస్ను మరింత బలోపేతం చేయాలని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కోరారు. జూబ్లీహిల్స్ డివిజన్ బీజేఆర్నగర్కు చెందిన ఛత్రపతి శివాజీ యూత్ అసోసియేషన్ సభ్యులు పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్లో చేరారు. ఆదివారం జూబ్లీహిల్స్లోని తన క్యాంపు కార్యాలయం వద్ద వారికి గులాబీ కండువాలు కప్పిన ఎమ్మెల్యే దానం నాగేందర్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ.. హైదరాబాద్ అభివృద్ధి కోసం ఇంత పెద్ద ఎత్తున నిధులు ఖర్చుచేసింది ఎవరూ లేరన్నారు. మంత్రి కేటీఆర్ నాయకత్వంలో హైదరాబాద్ నగరం గ్లోబల్ సిటీగా మారిందన్నారు. అనేక అంతర్జాతీయ కంపెనీలు పెట్టుబడులు పెడుతుండటంతో ఇక్కడి యువతకు ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరిగాయన్నారు. బీఆర్ఎస్ను ఢీకొట్టే సత్తాలేని కొన్ని పార్టీలు కేవలం మతం పేరుతో యువతను రెచ్చగొట్టి పబ్బం గడుపుకొంటున్నాయన్నారు. ఆయా పార్టీలు చేస్తున్న మత రాజకీయాలను యువత అర్థం చేసుకుంటున్నారని, రానున్న ఎన్నికల్లో అలాంటి పార్టీలకు గట్టిగా బుద్ధి చెబుతారన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్లో చేరిన డేవిడ్, మహేశ్, చింటూతో పాటు బీఆర్ఎస్ నాయకులు మామిడి నర్సింగ రావు, అప్పు, సిద్ధు తదితరులు పాల్గొన్నారు.