బన్సీలాల్పేట, నవంబర్ 5: జాతీయ బీసీ సంక్షేమ సంఘం, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మామిడాల బాలకృష్ణ తన అనుచరులతో కలిసి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ సనత్నగర్ అభ్యర్థి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదివారం పద్మారావునగర్లో వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే బీసీలకు న్యాయం జరుగుతున్నదని, సనత్నగర్ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులమై బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నామని బాలకృష్ణ తెలిపారు. నిత్యం ప్రజల మధ్యన ఉండే మంత్రి తలసాని పనితీరు బాగున్నదని, ఆయనను అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని తెలిపారు.
బీసీ సంఘం నాయకులు సంపత్కుమార్, సుమన్ యాదవ్, రాకేశ్, సతీశ్, శ్రావణ్, రమేశ్, సుశీల్, శశాంక్, ఉదయ్, ప్రదీప్, అల్బర్ట్ తదితరులు పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా రజక సంఘం అధ్యక్షుడు సంగు స్వామి, బీఆర్ఎస్ సికింద్రాబాద్ పార్లమెంట్ ఇన్చార్జి తలసాని సాయికిరణ్ యాదవ్, మహేశ్ యాదవ్, పద్మారావునగర్ బీఆర్ఎస్ ఇన్చార్జి జి.పవన్కుమార్ గౌడ్, డివిజన్ అధ్యక్షుడు వెంకటేశన్ రాజు, కార్యదర్శి ఎం.మహేందర్, శ్రీకాంత్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.