సుల్తాన్బజార్, కవాడిగూడ, అక్టోబర్ 3: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బతుకమ్మ వేడుకలు ప్రతీకగా నిలుస్తున్నాయని రాష్ట్ర క్రీడా, పర్యాటక శాఖ మంత్రి వి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు.ఈ మేరకు సోమవారం ఎల్బీ స్టేడియంలో సద్దుల బతుకమ్మ వేడుకల సందర్భంగా ఎల్బీ స్టేడియం నుండి ట్యాంక్బండ్ వరకు నిర్వహించిన బతుకమ్మ ర్యాలీని ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలతా శోభన్ రెడ్డి, సంగీత నాటక అకాడమీ చైర్మన్ దీపికా రెడ్డి, ఐఏఎస్ సందీప్ సుల్తానియాలతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా పూలతో దేవతలను పూజించేందుకు ఉపయోగిస్తే తెలంగాణలో మాత్రం పూలను ఆదిశక్తిగా కొలిచి పూజించే సంస్కృతి ఉందన్నారు. బతుకమ్మ వేడుకలలో భాగంగా తెలుగింటి ఆడపడుచులకు బతుకమ్మ చీరను కానుకగా అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని కొనియాడారు. బతుకమ్మ వేడుకలను నేడు ప్రపంచ వ్యాప్తంగా నిర్వహిస్తున్నారంటే ఆ గొప్పతనం సీఎం కేసీఆర్కే దక్కుతుందని చెప్పారు. కాగా వందల మంది కళాకారులు ఎల్బీస్టేడియం నుంచి బతుకమ్మలను ట్యాంక్బండ్ వరకు ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఈ ర్యాలీలో పులి వేష ధారణలు, కోలాటాల నృత్యాలు ఆకట్టుకున్నాయి.
రాంనగర్ గుండు వద్ద ..
ఎల్బీ స్టేడియం నుంచి ట్యాంక్బండ్ వరకు సాగిన బతుకమ్మల ఊరేగింపులో పాల్గొన్న మంత్రి శ్రీనివాస్గౌడ్, మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత, సంగీత నాటక అకాడమీ చైర్పర్సన్ దీపికా రెడ్డి తదితరులు
ఎల్బీ స్టేడియంలో బతుకమ్మలు..