హైదరాబాద్: రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలోని హెడ్ క్వార్టర్స్లో రాచకొండ పోలీసు ఉద్యోగుల బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ క్రమంలోనే ఆయుధ పూజా కార్యక్రమం కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ ఐపీయస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
అనంతరం ఆయుధాలకు, వాహనాలకు పూజ నిర్వహించి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకల్లో రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్తోపాటు అడిషనల్ సీపీ సుధీర్ బాబు, మల్కాజ్గిరి డీసీపీ రక్షిత మూర్తి, ఎల్బి నగర్ డీసీపీ సన్ప్రీత్ సింగ్, యాదాద్రి డీసీపీ నారాయణ రెడ్డి, ఏడీసీపీలు, ఏసీపీలు, మహిళా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.